Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శవర్గ సభ్యుడు రాజన్న
నవతెలంగాణ-బయ్యారం
బయ్యారం మండలంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం సత్వరమే స్టీలు పరిశ్రమ పనులు ప్రారంభించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మండా రాజన్న డిమాండ్ చేశారు. మంగళవారం వేజెళ్ల సైదులురావు భవనంలో తొడుగు యాదగిరి అధ్యక్ష నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గోదావరి జలాలు బయ్యారం పెద్ద చెరువుకు సీతారామ ప్రాజెక్టు ద్వారా వస్తున్నందున నీటి కొరత ఉండదని, బొగ్గు, విద్యుత్, రహదారి, డోలమైట్ తదితర వనరులు సైతం పుష్కలంగా ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలు స్థాపించే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డమాండ్ చేశారు. సమావేశంలో మండల కార్యదర్శి నంబూరి మధు, నిడికొండ చంటి, జలగం యాకయ్య, ఎస్ కే యాకుబ్, వల్లాలా వెంకన్న, ఎస్.కే కరీం, జుజ్జురి శీను, నిడికొండ మారయ్య తదితరులు పాల్గొన్నారు.