Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా సదస్సు డిమాండ్
నవతెలంగాణ-కాశిబుగ్గ
ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్లను వెనక్కి తీసుకోవాలని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా సదస్సు డిమాండ్ చేసింది. వరంగల్లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్లో మంగళవారం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండీ అబ్బాస్ మాట్లాడారు. దేశ ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే ఇలాంటి
వాటిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. వరంగల్ జిల్లా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదికకు అన్ని పార్టీల కార్యదర్శులు కన్వీనర్లుగా వ్యవహరిస్తారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు ఎస్కే పాషా, ఎంసీపీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉపేందర్రెడ్డి, న్యూడెమోక్రసీ రీజనల్ కమిటీ నాయకులు గౌని అయిలయ్య, మండల వెంకన్న, ప్రసాద్, రాజేష్, వేణు, ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శి గౌడగాని శివాజీ, ఐద్వా జిల్లా కార్యదర్శి నలిగంటి రత్నమాల మాట్లాడారు. ఈ సదస్సుకు సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆరెల్లి కృష్ణ, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి మాలి బాబురావు, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎల్.రాజు, ఎంఎల్ పార్టీ కార్యదర్శి మల్లేశం, ఆర్ఎస్పీ కార్యదర్శి సమేష్, అఖిల భారత చైతన్య మహిళా సంఘం కార్యదర్శి రమాదేవి, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు భూజేందర్ తదితరులు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.