Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంద మందికిపైగా మృతి,
4 వేల మందికి గాయాలు
బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్ పోర్టు వద్ద సంభవించిన రెండు భారీ పేలుళ్లలో వందమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మూడు వేలకు మందికి పైగా గాయపడ్డారు. మృతులు, గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6.10 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ పేలుళ్ల ధాటికి నగరంలోని భవనాలన్నీ కంపించడమో, కూలిపోవడమో జరగడంతో సుమారు 2,50,000 మంది నిరాశ్రయులయ్యారు. వీరికి ఆహారం, మంచి నీరు, వసతి కల్పించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పేలుళ్లతో నగరం మొత్తం ధూళి, పొగతో నిండిపోయింది. బీరుట్ పోర్ట్లో భారీ స్థాయిలో నిల్వ చేసిన రసాయనాలే పేలుళ్లకు కారణమని ఆ దేశ అంతర్గత మంత్రి మహమ్మద్ ఫాహ్మి తెలిపారు. ఇంత భారీ స్థాయిలో రసాయనాలు నిల్వ చేయడం గురించి కస్టమ్స్ అధికారులు విచారణ చేస్తున్నారని మంత్రి చెప్పారు. పేలుళ్లుకు నిజమైన కారణం గురించి, రసాయనాల నిల్వ గురించి ఐదు రోజుల్లో విచారణ పూర్తి చేస్తారని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రమాదం నేపధ్యంలో జాతీయ సంతాప దినంగా బుధవారాన్ని ప్రధాని హస్సన్ దియాబ్ ప్రకటించారు.