Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ఒకవైపు ప్రపంచ మానవాళిని కరోనా వైరస్ వణికిస్తుండగానే చైనాలో మరో వైరస్ వెలుగు చూసింది. ఎస్ఎఫ్టిఎస్ (సివియర్ ఫీవర్ విత్ త్రామ్బోసిటోపెనియా సిండ్రోమ్) వైరస్గా పిలుస్తున్న దీనివల్ల ఇప్పటి వరకూ ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 60 మంది దీని భారిన పడినట్లు చైనా అధికారిక మీడియా బుధవారం పేర్కొంది. ఈ కొత్త మాయదారి వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకూ చైనాలోనా జియాంగ్సు ప్రావిన్స్లో 37 మందికి పైగా దీని భారిన పడ్డారని పేర్కొంది. ఆ తరువాత అన్హుయి ప్రావిన్స్లో మరో 23 కేసులు వెలుగుచూశాయి. జియాంగ్సు రాజధాని నన్జింగ్కు చెందిన ఒక మహిళ వైరస్ లక్షణాలైన జ్వరం, దగ్గు వంటివి వెలుగుచూశాయి. ఆమె శరీరం లోపల ల్యూకోసైట్, రక్తం ప్లేట్లెట్స్ క్షీణించినట్లు వైద్యులు గుర్తించారు. నెల పాటు ఆమెకు చికిత్స అందించిన వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఎస్ఎఫ్టిఎస్ అనేది కొత్త వైరసేమీ కాదు. 2011లోనే తొలిసారిగా చైనాలో ఇది ఉనికిలోకి వచ్చింది. ఇది బున్యా వైరస్ కేటగిరీకి చెందినది. దీనికి సంబంధించి జెజియాంగ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే ఆసుపత్రికి చెందిన వైద్యుడు షెంగ్ జిఫాంగ్ మాట్లాడుతూ ఈ వైరస్ మానవుని నుంచి మానవునికి సోకే అవకాశం ఉందన్నారు. రోగుల నుంచి ఇతరులకు ఈ వైరస్ రక్తం ద్వారా లేదా శ్లేష్మం ద్వారా చేరే ప్రమాదం ఉందని చెప్పారు.