Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంటోనీ ఫౌసీ
వాషింగ్టన్ : వచ్చే ఏడాది ప్రారంభానికి కోట్ల సంఖ్యలో కరోనా వైరస్ కట్టడికి సంబంధించి వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని, ఆ సంఖ్య 2021 చివరి నాటికి వందల కోట్లకు చేరుతుందని అమెరికాకు చెందిన అంటువ్యాధుల నియంత్రణ విభాగానికి చెందిన అధికారి అంటోనీ ఫౌసీ పేర్కొన్నారు. బుధవారం ఆయన రాయిటర్స్ మీడియా సంస్థతో మాట్లాడుతూ వ్యాక్సిన్ సాయంతో ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి కట్టడి అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నవంబర్ నాటికి అమెరికా విజయవంతంగా వ్యాక్సిన్ను అభివద్ధి చేస్తుందని తాను ప్రకటించడంలో అధ్యక్ష భవనమైన వైట్హౌస్ నుంచి తనపై ఎటువంటి ఒత్తిడి లేదని అన్నారు. కరోనా వ్యాక్సిన్ ఆమోదంలో రాజకీయ పరమైన జోక్యాన్ని పరిగణనలోకి తీసుకోబోమని ఇప్పటికే వైద్య అధికారులు చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. భద్రత, సమర్ధత ప్రమాణాలే ప్రధానమని తెలిపారు. కరోనా కట్టడిలో కొన్ని దేశాలు విజయవంత మయ్యాయని చెప్పారు.