Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిరోషిమా: రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. 1945 ఆసగ్టు 6న అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి సృష్టించిన ఈ దారుణ మారణకాండలో హిరోషిమాలో 1,50,000 మంది, నాగసాకిలో 75,000 మంది చనిపోయారు. ఈ అణు ధార్మికత వల్ల ఇంకా అనేక లక్షల మంది కేన్సర్, థైరాయిడ్ కేన్సర్, గర్భస్రావం, పుట్టకతోనే అంగవైకల్యం వంటి భయంకకర వ్యాధులతో నరక యాతన అనుభవించారు. ఇప్పటికీ దాని ప్రభావం ఏదో ఒకరూపంలో కొనసాగుతూనే ఉంది. హిరోషిమా, నాగసాకిలో అణు బాంబుల ప్రయోగం వల్ల అణుధార్మికత ఏదీ లేదని అమెరికన్ మీడియా ఆనాడు తప్పుడు ప్రచారం చేసింది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక 1945 సెప్టెంబరు5న ఒక కధనాన్ని ప్రచురించింది. ఆ తప్పుడు కథనాన్ని రాసిన రిపోర్టుర్ విలియం లారెన్స్కు ప్రతిష్టాత్మక పులిట్జర్ ప్రైజ్ లభించింది.
ఆస్ట్రేలియాకు చెందిన విల్ఫ్రెడ్ బుర్చెట్ అమెరికానేతృత్వంలోని సంకీర్ణ దళాల ఆంక్షలను లెక్కచేయకుండా హిరోషిమా, నాగసాకిలో పర్యటించి అక్కడి వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అమెరికా హిరోషిమా, నాగసాకిపై అణు బాంబులను ప్రయోగించి నందుకు జపాన్కు ఇప్పటికీ క్షమాపణ చెప్పడానికి నిరాకరిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధాన్ని జపాన్ ప్రారంభిస్తే, దానికి ముగింపు పలికేందుకే తాము ఈ అణు బాంబులతో దాడి చేశామని అమెరికా తన చర్యను సమర్థించుకుంటోంది. 1946-58 మధ్య అమెరికా 67 అణు బాంబులను పసిఫిక్ సముద్రంలోని మార్షల్ ఐలండ్స్లో పేల్చింది. అమెరికా తన ప్రపంచాధిపత్యం కోసం ఇప్పుడు చైనా ను లక్ష్యంగా చేసుకుని యుద్ధ వ్యూహాలను రచిస్తోంది.
చైనా చుట్టూ 400కి పైగా మిలిటరీ స్థావరాలను అది నెలకొల్పింది.ఆస్ట్రేలియా నుంచి జపాన్, కొరియా, యురేసియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ఈ స్థావరాలను ఏరాట్రుచేసనిట్టు అమెరికన్ వ్యూహ నిపుణుడు ఒకరు వెల్లడించారు. ఈ స్థావరాల్లో క్షిపణులు, బాంబర్లు, యుద్ధ నౌకలతో బాటు అణ్వస్త్రాలను కూడా పెద్దయెత్తున ఉంచింది. అమెరికా చర్యలు ప్రపంచ శాంతికే పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. అణు నిరాయుధీకరణ ద్వారానే ప్రపంచ శాంతి కాపడబడుతుంది. హిరోషిమా నాగసాకి ఘటనలకు 75 ఏళ్లు అయిన సందర్భంగా అణ్వాయుధాలకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతి కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది.