Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 99వ వార్షికోత్సవం సందర్భంగా
దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ
సియోల్ : మలిదశ ఉద్యమం కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ (ఎస్సిఎపి) ప్రకటించింది. ఆగస్టు 2న ఎస్సిఎపి 99వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ నేత బ్లేడ్ జిమాండే టెలివిజన్ ద్వారా ప్రసంగించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పునాదులను గుర్తుచేసుకోవడం చాలా క్లిష్టమైనదని అన్నారు. వర్ణవివక్ష అంతం అంటే సామ్రాజ్యవాద అంతం కాదని పేర్కొన్నారు. సామ్రాజ్యవాదం అహంకారపూరితంగా మారి విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇది తేటతెల్లమైందని తెలిపారు. సామ్రాజ్యవాద శక్తులు వెనకుండి నడిపించే ఫార్మా కంపెనీలు అధిక లాభాల కోసం వ్యాక్సిన్, చికిత్స మందుల మార్కెట్ కోసం పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలితో సామ్రాజ్యవాదం మరింత ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాల కంటే అమెరికానే గొప్ప అని చెప్పుకునేందుకు కయ్యానికి కాలు దువ్వుతోందని, ఇందులో భాగంగా దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ వాహన నౌకలను మోహరిస్తోందని, ఇరాన్పై యుద్ధ బెదిరింపులకు పాల్పడుతోందని, అమెరికాలో జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మూమెంట్పై ఉక్కుపాదం మోపుతున్న తీరు అందుకు అద్దం పడుతోందని విమర్శించారు. డబ్లుహెచ్ఓ నుంచి వెనక్కు వెళ్లడం దురహంకార పూరిత వైఖరికి నిదర్శనమని అన్నారు. దేశ విముక్తి పోరాటంలో ఎస్ఎసిపి పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు. 1963-64లో జరిగిన రివోనియా ట్రయల్స్ సమయంలో నెల్సన్ మండేలాతో సహా ఇతర ప్రతివాదులందరూ పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఉన్నారని తెలిపారు.