Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ఎజెండా వెనుక రాజకీయం
- లౌకిక విలువలకు ప్రమాదం
- న్యూయార్క్ టైమ్స్వ్కేర్ వద్ద భారీ నిరసనలు
- భారత్లో ఫాసిజం భావాలు బలోపేతం:అమెరికాలో హక్కుల సంఘాలు నిరసన
న్యూయార్క్: భారత్లో లౌకిక విలువలకు ప్రమాదం ఏర్పడిందని న్యూయార్క్లో భారతీయ అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని వివిధ హక్కుల సంఘాలు శుక్రవారం టేమ్ స్క్వేర్ వద్ద భారీ నిరసన కార్యక్ర మాన్ని చేపట్టాయి. మోడీ సర్కార్కు, జాతి వివక్షకు వ్యతిరేకంగా ప్లకా ర్డులు ప్రదర్శించారు. భారత్లో ఫాసిజం భావాలు బలోపేతమవు తున్నాయని, అయోధ్యలో భూమి పూజ కార్యక్రమా న్ని 'అమెరికన్ ఇండియన్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ' నిర్వహించటం సరైంది కాదని నిరసనకారులు నినదించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పలు గ్రూపులు 'కోలేషన్ టు స్టాప్ జినోసైడ్ ఇన్ ఇండియా' అనే పేరుతో మీడియాకు ఒక ప్రకటనను విడుదలచేశారు. అమెరికన్ ఇండియన్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ రామ మందిర నిర్మాణ భూమి పూజను పురస్కరించుకుని వేడుకలు నిర్వహించడం పట్ల అమెరికాలో పలు హక్కుల సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలతో టైమ్ స్క్వేర్ ప్రాంతం మారుమ్రోగింది. ఈ మేరకు ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, ది కౌన్సిల్ ఆఫ్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, అంబేద్కర్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, పెరియార్ ఇంటర్నేషనల్ యూఎస్ఏ వంటి పలు సంస్థలు భారత ప్రధాని చర్యను విమర్శిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. భారత్లో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు తమతో చేతులు కలపాల్సిందిగా కోరాయి. లౌకిక భావనతో నిండిన భారతే నిజమైన ఇండియా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఆగస్టు 5నే ఎందుకు?
బాబ్రీ మసీదు కూల్చివేసిన చోట రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరపటం, ఆ కార్యక్రమానికి భారత ప్రధాని మోడీ హాజరుకావటంపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ఈ కార్యక్రమ నిర్వహణకు ఆగస్టు 5ను ఎంచుకోవడం కాశ్మీరీలపై మరో దురాక్రమణ వంటిది. ప్రజాస్వామ్య భారతాన్ని హతమార్చేందుకు, ద్వేషాన్ని పెంపొందించేందుకు మతాన్ని ఉపయోగించడాన్ని ఖండిస్తున్నాం'' అని కోలేషన్ అగైనెస్ట్ ఫాసిజం ఇన్ ఇండియా(సీఏఎఫ్ఐ- భారత్లో ఫాసిజం వ్యతిరేక కూటమి)కి చెందిన అనియా వ్యాఖ్యానించారు. హిందూత్వ శక్తులు, వారిని అనుసరించే ఇండో- అమెరికన్లు అధికార బలంతో రామ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని అమెరికాలో వేడుకలా నిర్వహించాయని అనియా అన్నారు. ఆ అధికారం ద్వేషాన్ని పెంపొందించడానికి, భారత్లోని ముస్లింలు, ఇతర వర్గాలపై దుందుడుకు చర్యలను మరింతగా ప్రేరేపిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టికల్ 370ని రద్దు చేసి సరిగ్గా ఏడాది పూర్తయిన నాడే రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయడం పట్ల ఇండియన్ అమెరికన్ ముస్లిం, ఇతర హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ''మనుషుల ప్రాణం కంటే వేడుకలే ముఖ్యమా, కాశ్మీరీలకు హక్కులు లేవా? ముస్లింలపై దాడులు ప్రోత్సహించేలా వ్యవహరిస్తారా? '' అంటూ నిరసనకారులు ప్రశ్నించారు.