Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: కరోనా నేపథ్యంలో అమెరికా తన పౌరులను ఉద్దేశించి తీసుకువచ్చిన ఉన్నతస్థాయి గ్లోబల్ హెల్త్ ట్రావెల్ అడ్వైజరీని(ప్రయాణ సూచనలు) గురువారం ఎత్తివేసింది. దీనికి సంబంధించి దాదాపు 50కి పైగా దేశాల స్థితిని మార్చకుండా ఈ వ్యవస్థ పూర్వ స్థితిని పునరుద్ధరించారు. ఇదే సమయంలో కరోనా ఉధతిని దష్టిలో పెట్టుకొని భారత్, చైనాలో కూడా పర్యటించవద్దని అమెరికా తన పౌరులకు సూచించింది. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో ఇప్పటికే దాదాపు 50 లక్షల కేసులు నిర్ధారణ అవగా, లక్ష 60 వేల మందికి పైగా మరణించారు. అమెరికా ఉన్నత స్థాయి ప్రయాణ సూచన అయిన లెవల్ 4 లిడూనాట్ ట్రావెల్ అడ్వైజరీలిని మార్చి 19న జారీ చేసింది. కరోనా నేపథ్యంలో విదేశాల్లో ప్రయాణించవద్దని తమ పౌరులకు సూచనలు చేసింది. ఈ లెవల్ 4 అడ్వైజరీలో ఇతర 50 దేశాలతో పాటు చైనాతో పాటు భారత్ కూడా ఉంది.