Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారకస్: కరోనా రోగులకు చికిత్స అందించేందుకు వెనిజులా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాజధాని కారకస్లోని పోలీ హెడ్రోన్ స్పోర్ట్స్ మైదానాన్ని అతిపెద్ద ఫీల్డ్ ఆసుపత్రిగా మార్చింది. వెనిజులా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగుజ్ మాట్లాడుతూ ఈ సదుపాయాన్ని ఈనెల 2న ప్రారంభించినట్లు చెప్పారు. ఆ ఆసుపత్రిలో 1200 బెడ్ల సదుపాయం ఉందన్నారు. ఉచిత, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించేందుకు 300 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు తెలి పారు. కరోనాపై పోరులో క్యూబా ఇస్తున్న మద్దతుకు ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన కతజ్ఞతలు చెప్పారు. ఇది ఒక ప్రత్యేక మధ్యంతర ఆసుపత్రిగా పనిచేస్తుందని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో పేర్కొన్నారు. ఇందులో ట్రామా సర్వీసులతో కూడిన అత్యవసర విభాగం కూడా ఉంది. మొబైల్ ఎక్సరే పరికరాలు, లేబొరేటరీ, ఒక ఫార్మసీ, మెడికల్, నర్సింగ్ సిబ్బందికి బ్రేక్రూం ఉన్నాయి.