Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధ్యక్షుని దిష్టిబొమ్మ దగ్ధం
బీరుట్ : లెబనాన్లో దాదాపు 160 మంది మృతికి కారణమైన పేలుడుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ నిరసనకారులు రాజధాని బీరుట్లో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడు అవోన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అన్ని రంగాల్లో విఫలమైన హరిరి ప్రభుత్వం రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. గత ఏడాది లెబనాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా ఆందోళనలు సాగిన సంగతి విదితమే.దేశ చరిత్రలోనే అత్యంత భయానకమైన ఈ పేలుళ్లపై ఆగ్రహించిన ప్రజలు వేలాది మంది బీరుట్ వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిం చారు. నిరసనకారులపై లెబనాన్ ప్రభుత్వం దమనకాండను ప్రయోగించింది. పార్లమెంటు భవనం వైపు నిరసనకారులు రాకుండా అడ్డుకునేం దుకు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసింది. వాటిని తోసుకుని ముందకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై భాష్పవాయు గోళాలను ప్రయోగించింది. అనేక మందిని నిర్బం ధించింది. లెబనాన్ ప్రభుత్వానికి మద్దతుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగారు. లెబనాన్ ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడేందుకు అవసరమైన సాయం అందించేందుకు తాను సిద్ధమని హరిరికి ఫోన్లో తెలిపారు.
మరో వైపు బీరుట్ పేలుళ్లలో జాడతెలియకుండా పోయిన వారి కోసం సహాయక బృందాలు చర్యలను ముమ్మరం చేశాయి.