Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ ఆమోదం
కాబూల్: ఉగ్రవాద సంస్థ తాలిబన్లకు చెందిన 400 మంది ఖైదీల విడుదల చేసేందుకు సంబంధించిన తీర్మానానికి ఆఫ్ఘనిస్థాన్ అసెంబ్లీ లోయా జిర్గా ఆదివారం ఆమోదం తెలిపింది. దాదాపు 19 సంవత్సరాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలకు మార్గం సుగమం చేసేందుకు ప్రభుత్వం ఈ విధమైన చర్య తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. లి ఒక అడ్డంకిని తొలగించేందుకు, శాంతి ప్రక్రియను ప్రారంభించేందుకు, రక్తపాతం ముగించేందుకు 400 మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసేందుకు లోయా జిర్గా ఆమోదం తెలిపిందిలి అని అసెంబ్లీ ఒక తీర్మానంలో తెలిపింది. రాజధాని కాబూల్లో అఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని అసెంబ్లీని సమావేశపరిచారు. ఈ సమావేశానికి దాదాపు 3,200 మంది నేతలు హాజరయ్యారు. కరోనా భయాందోళనల నేపథ్యంలో ఖైదీలను విడుదల చేసే అంశంపై వీరు ప్రధానంగా చర్చించారు. శాంతి చర్చలను ప్రారంభించేందుకు జైళ్లలో ఉంటున్న తమ వారిని విడు దల చేయాలని తాలిబన్లు షరతు పెట్టారు. తాజా 400 మంది ఖైదీల విడుదలకు తీసుకున్న నిర్ణయంతో ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 5 వేల మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసినట్టు అయింది.