Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కేసుల్లో 40 శాతం అవే..
- సహజంగా ఉండే రోగనిరోధకశక్తితో వైరస్ సోకినా బయటపడుతున్న జనం
- పెద్ద పట్టణాల్లో తగ్గుముఖం పడుతున్న వైరస్ వ్యాప్తి
- మహమ్మారి అంతానికి సూచిక కావొచ్చు : నిపుణులు
న్యూయార్క్: ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ఉధృతి లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంటున్నా.. దాని బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే ఈ మహమ్మారి బారిన పడుతున్న వారిలో 40 శాతం మందికి ఎలాంటి లక్షణాలూ లేవని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా జ్వరం, జలుబు, ఒంటి నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన కోల్పోవడం వంటివి కరోనా లక్షణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. కానీ గత నెలలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 40 శాతం ఎటువంటి లక్షణాలూ బయటపడలేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కేంద్రాల ద్వారా వచ్చిన నివేదికల ఆధారంగా తెలుస్తున్నది. ఇదే విషయమై శాన్ ఫ్రాన్సిస్కో లోని కాలిప్ఫోర్నియా విశ్వా విద్యాలయంలో అంటువ్యాధుల నిపుణురాలుగా పని చేస్తున్న మోనికా గాంధీ ఒక నివేదికను వెలువరించారు. ఆ నివేదికలో... 'ఎక్కువస్థాయిలో లక్షణాలు లేని కేసులు నమోదవడం మంచి విషయం' అని ఆమె అనడం గమనార్హం. ఇది వ్యక్తిగతంగానేగాక సమాజానికి శుభ సూచికం అని నివేదికలో వివరించారు. ఇందుకు సంబంధించి ఆమె నిర్వహించిన సర్వేలో.. బోస్టన్ లో నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన వసతి గహం లో 147 మందికి కరోనా ప్రబలగా వారిలో 88 శాతం కేసుల్లో కోవిడ్ లక్షణాలేవీ కనిపించలేదు. స్ప్రింగ్ డేల్ ఆర్క్ లో ఒక ఆహార శుద్ధి కర్మాగారంలో 481 మందికి వ్యాధి సోకగా.. వారిలో 95 శాతం మందికి అసలు కరోనా లక్షణాలే లేవని తేలింది. ఇక నార్త్ కరోలినా, ఒహియో, వర్జీనియాలలోని జైళ్లలో ఉంటున్న సుమారు 3,380 మంది ఖైదీలు ఈ వైరస్ బారిన పడ్డా, వారిలో 96 శాతం మందిలో ఏ విధమైన లక్షణాలూ బయటపడలేదు. దీనిమీద ఆమె విశ్లేషణ ప్రారంభించగా.. ప్రపంచ జనాభాలో ఒక శాతం మందికి సహజంగా మనిషి బాడీలో ఉండే 'టీ' కణాలే వైరస్ ను సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని పలు అధ్యయనకర్తలు నివేదించారు. అంతేగాక బాల్యం లో చిన్న పిల్లలకు పోలియో, ఇతర వ్యాధులు సోకకుండా ఇచ్చే టీకాల ద్వారా కూడా రోగ నిరోధకశక్తి పెరిగి ఉండొచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నా అది చిన్న పిల్లలలపై తక్కువ ప్రభావం చూపుతుండటం, యువత దాని బారిన పడ్డా త్వరగానే కోలుకుంటుండటం ఆశావాహ పరిణామాలని మోనికా వివరించారు. ఇదే విషయమై స్వీడన్ లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్న హన్స్ గుస్తాఫ్ స్పందిస్తూ.. పలు అధ్యయనాల్లో పేర్కొంటున్నట్టు కరోనా వైరస్ కంటే ప్రజల్లో ఉండే రోగ నిరోధకశక్తి సామర్ధ్యం ఎక్కువని అంటున్నారు. మహా నగరాలైన బార్సిలోనా, బోస్టన్, వూహాన్, ఇతర ప్రధాన పట్టణాల్లో మహమ్మారి మొదట్లో కోరలు చాచినా తర్వాత తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రజల్లో ప్రతిరోధకాలు అధికంగా ఉన్నాయనీ, అందువల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతున్నదని ఆయన వెల్లడించారు. 'ప్రజారోగ్య దక్పథం నుంచి ఇది చాలా శుభవార్త' అని గుస్తాఫ్ తెలిపారు. మొదట్లో స్వీడన్ లో విజంభించిన ఈ వైరస్ తర్వాత తగ్గుముఖం పట్టడం, మరణాల రేటు కూడా తగ్గడం, లాక్డౌన్ లు లేకున్నా కేసుల సంఖ్య నామమాత్రంగానే ఉండడం, మాస్కులు అవసరం లేకుండానే అక్కడి ప్రజలు బయట సంచరిస్తుండటం వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని గుస్తాఫ్ తన అధ్యయనాన్ని నివేదించారు.