Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో: శ్రీలంక నూతన ప్రధానిగా మహింద రాజపక్స ఆది వారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తర కొలంబోలోని చారిత్రక బుద్ధ ఆలయం రాజమహ విహా రయాలో ఈ కార్య్రకమం జరిగింది. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి మహింద రాజపక్స సోదరుడు, శ్రీలంక అధ్యక్షుడు గొటబాయా రాజపక్స కూడా హాజరయ్యారు. క్యాబినెట్, స్టేట్, డిప్యూటీ మంత్రులు సోమవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఇటీవల తొమ్మిదవ పార్లమెంట్కు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజపక్స నేతృత్వంలోని పీపుల్స్ పార్టీ ఘట విజయం సాధించింది. మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. పార్లమెంట్లోని 225 సీట్లకు గానూ 150 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. మాజీ ప్రధాని రణిల్ విక్రమ్ సింఘేకు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. 1977 నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ, నాలుగుసార్లు ప్రధానిగా చేసిన విక్రమ్ సింఘే కూడా ఘోర పరాజయం పాలయ్యారు. 74 ఏండ్ల మహింద రాజపక్స ఈ ఏడాది జులై నాటికి తన 59 ఏండ్ల పార్లమెంటరీ రాజకీయ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. 1970లో 24 ఏండ్ల వయసులో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతర కాలంలో ఆయన రెండుసార్లు శ్రీలంక అధ్యక్షుడిగా, మూడు సార్లు ప్రధానిగా విధులు నిర్వర్తించారు. తాజా ప్రమాణ స్వీకారంతో ఆయన నాలుగోసారి ప్రధానిగా ఎన్నికైనట్టు అయింది.