Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: మహాత్మా గాంధీ ధరించిన కండ్లజోడును బ్రిటన్లో వేలానికి ఉంచారు. 21న వేలం వేయనున్నట్టు నైరుతి ఇంగ్లాండ్లోని ఈస్ట్ బ్రిస్టల్ ఆక్షన్స్ సంస్థ నిర్ణయించింది. బంగారు పూతతో కూడిన ఈ కండ్లజోడు ఓ లెటర్ బాక్స్ ద్వారా ఈ సంస్థకు వచ్చిందనీ, అందులో 'ఇవి గాంధీకి చెందిన కండ్లజోడు, నాకొకసారి కాల్
చేయండి' అని రాసి ఉన్న లేఖ ఒకటి వచ్చిందని వేలందారుడు అండ్రూ స్టవ్ తెలిపారు. 'గాంధీ మొత్తం జీవితంలో ఈ కండ్లజోళ్లు కూడా ముఖ్య భూమికను పోషించాయి. ఇవి అరుదైనవి, ముఖ్యమైనవి' అంటూ ఆక్షన్స్ సంస్థ వెబ్సైట్లో పేర్కొంది. 1910-1930ల్లో దక్షిణ ఆఫ్రికాలో బ్రిటీష్ పెట్రోలియంలో పనిచేసిన విక్రయదారుడి బంధువుకి తాలిస్మానిక్ నాన్-వయెలెంట్ ఐకాన్ వీటిని అందించినట్టు భావిస్తున్నామని సంస్థ పేర్కొంది.