Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రస్సెల్స్ : మయన్మార్ పౌర హక్కుల నేత ఆంగ్ సాన్ సూకీని షాకరోవ్ ప్రైజ్ కమ్యూనిటీ నుంచి యురోపియన్ పార్లమెంట్ తొలగించింది. రోహింగ్యాలపై ప్రభుత్వం సాగించిన నేరాలను ఆమె ఆమోదించిన కారణంగా ఈ చర్య తీసుకుంది. మాజీ ప్రజాస్వామ్య ప్రచారకర్త అయిన సూకీకి 1990లో మానవ హక్కుల పురస్కారాన్ని ఈయూ అసెంబ్లీ అందచేసింది. అంతకు ఒక ఏడాది ముందే ఆమె నోబెల్ శాంతి బహుమతిని కూడా అందుకున్నారు. 1990కి ముందు నాటి సూకీ కృషికి గానూ ఈ అవార్డు లభించిందని అందువల్ల దాన్ని వెనక్కి తీసుకోలేమని పార్లమెంట్ సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం షాకరోవ్ ప్రైజ్ కమ్యూనిటీ నుంచి ఆమెను తొలగించడం యురోపియన్ పార్లమెంట్ సభ్యులకు అందుబాటులో వున్న అతి కఠినమైన ఆంక్షలుగా చెప్పవచ్చు. మియన్మార్లో రోహింగ్యా ప్రజలకు వ్యతిరేకంగా సాగిన నేరాలను ఆమోదించడం, వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకో వడంలో విఫలమైనందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు యురోపి యన్ పార్లమెంట్ స్పీకర్, నేతలు తెలిపారు. సైనిక దాడుల నుంచి తప్పించుకునేందుకు 2017లో దాదాపు ఏడున్నర లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్కు పారిపోయారు. సైనిక పాలనను అంతమొందిం చడానికి పోరాడిన మాజీ రాజకీయ ఖైదీ అయిన సూకీని స్వేచ్ఛ కోసం పోరాడే యోధురాలిగా ఒకప్పుడు ప్రపంచమంతా గౌరవించింది.