Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : అమెరికన్ల ప్రజల మనస్సుల్లో పీడకలగా మిగిలిపోయిన సెప్టెంబరు 11 తీవ్రవాద దాడుల సందర్భంగా ఆనాడు మృతి చెందిన వారికి శుక్రవారం వేలాదిమంది ప్రజలు నివాళులు అర్పించారు. కరోనా కారణంగా నివాళి అర్పించే సాంప్రదాయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని కమ్యూనిటీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. మరికొన్ని చోట్ల మార్పులతో నిర్వహించారు. ఒకపక్క కరోనా సంక్షోభం, మరోపక్క జాతి వివక్ష దాడులు జరుగుతున్న అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ కార్యక్రమం జరిగింది. పెన్సిల్వేనియాలో షాంక్స్విల్లె సమీపంలోని ఫ్లైట్ 93 నేషనల్ మెమోరియల్ వద్దకు ట్రంప్, బిడెన్లు ఇరువురు వేర్వేరు సమయాల్లో వచ్చి ఘనంగా నివాళి అర్పించారు. న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద సెప్టెంబరు 11నాటి మెమోరియల్ ప్లాజా వుంది, ఆ పక్కనే రెండో స్మారక చిహ్నం వుంది. కరోనా వల్ల పెంటగన్ విధించిన ఆంక్షల కారణంగా బాధిత కుటుంబాలు హాజరు కాలేకపోయాయి. అయితే రోజు మొత్తంలో అప్పుడప్పుడూ ప్రజలు చిన్న చిన్న బృందాలుగా వచ్చి నివాళులు అర్పించడం కనిపించింది. ప్లాజా దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో మరణించిన వారి పేర్లు స్పీకర్లో వినిపించేలా రికార్డింగ్ పెట్టారు. దీనివల్ల ప్రజలు వేదిక దగ్గరకు రాకుండా దూరంగా వుండే తమవారిని తలచుకోవడానికి వీలు కలిగింది. అయితే ఈ మార్పు వల్ల కార్యక్రమ భావోద్వేగాల్లో మార్పు కనిపించిందనీ, కొంతమంది బాధితుల బంధువులు అభిప్రాయపడ్డారు.