Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా : ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19ని అరికట్టేందుకు ఆయా దేశాల శాస్త్రవేత్తలు పోటీ పోటీగా వ్యాక్సిన్లు రూపొందించే పనిలో పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా 180 వ్యాక్సిన్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తూ ఉండగా..వీటిలో 35 మనుషులపై ప్రయోగాలు చేపట్టడం వరకు వచ్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ జెబ్రియేసస్ తెలిపారు. కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు వ్యాక్సిన్లు, రోగ నిర్థారణ, చికిత్స సమానంగా వేగవంతం చేయాల్సిన అవసరముందని హెచ్చరించారు. ఈ ఫిబ్రవరిలో..పరిశోధన ప్రాధాన్యతలను గుర్తించేందుకు వందలాది మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులను డబ్ల్యూహెచ్ఓ ఒక్క చోట చేర్చిందనీ, థెక్సామెథోసన్ వంటి కొన్ని ధెరపీలు కోవిడ్-19 రోగుల్లో ప్రతికూల ప్రభావాన్ని కనబర్చాయనీ, ప్రస్తుతం 180 వ్యాక్సిన్లు రూపొందిస్తుండగా..35 క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని చెప్పారు. రష్యా అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ..30కిపైగా వ్యాక్సిన్లు వివిధ దశల క్లినికల్ ట్రయల్కు వెళ్లడంపై డబ్ల్యూహెచ్ఓ స్వాగతించిందని చెప్పారు. రష్యా శాస్త్రవేత్తలు, అధికారులకు సంస్థ సహాకారం అందింస్తుందని తెలిపారు. స్పుత్నిక్ వ్యాక్సిన్ పరీక్షల వివరాలను అధ్యయనం చేసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.