Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురు మృతి, వందలాది ఇండ్లు దగ్ధం
శాన్ఫ్రాన్సిస్కో : అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు శాన్ఫ్రాన్సిస్కో తీర ప్రాంతంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కార్చిచ్చు కారణంగా మంటలు ఎగసిపడి పశ్చిమ తీరంలోని వందలాది ఇండ్లు గురువారం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. గడచిన 48 గంటల్లో ఉత్తర కాలిఫోర్నియాలో మెరుపువేగంతో వ్యాపించిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు ఒరెగాన్లో చనిపోయారు. వాసింగ్టన్ రాష్ట్రంలో ఒక ఏడాది బాలుడు చనిపోయాడని పోలీసులు తెలిపారు. మూడు రాష్ట్రాల్లో లక్షలాది మంది తమ ఇండ్లను ఖాళీ చేశారు.
ఒరెగాన్ రాష్ట్రాల్లో దాదాపు 100 పెద్ద అడవుల్లో మంటలు చెలరేగాయి. 3000 మంది అగ్నిమాపక సిబ్బంది కార్చిచ్చును నిలువరించేందుకు పోరాడుతున్నారు. ఒరెగాన్లోని క్యాస్కేడ్ పర్వత శ్రేణిలోని కనీసం ఐదు కమ్యూనిటీలు, తీరప్రాంత వర్షారణ్య ప్రాంతాలు సాధారణంగా ఈ కార్చిచ్చు వ్యాప్తి నుండి భయటపడ్డాయి. తూర్పు సేలం, ఒరెగాన్, సెర్్చ అండ్ రెస్క్యూ బృందాలు కార్చిచ్చులో చిక్కుకుపోయిన డెట్రాయిట్లోకి ప్రవేవించాయి. సైనిక హెలికాఫ్టర్లు పట్టణాన్ని ఖాళీ చేయించలేకపోవడంతో అగ్ని మాపక సిబ్బంది నివాసితులను డ్రామెటిక్ పర్వతాలవైపుకు తరలించారు. పోర్ట్ల్యాండ్కు దక్షిణాన 80 కిలోమీటర్ల దూరంలో ఒరెగాన్లోని లియోన్స్ సమీపంలో మంటలు చెలరేగడంతో 12 ఏండ్ల బాలుడు తన కుక్కతో సహా కారులో కాలిపోయాడనీ, అతని అమ్మమ్మ కూడా చనిపోయిందని భావిస్తున్నారు. దక్షిణ మెడ్ఫోర్డ్ నగరంలో ఎక్కువ భాగం మంటలు వ్యాపించడంతో 82,000 మంది నివాసితులు ఖాళీ చేయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.