Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం
- అమెరికాలో 31కు చేరిన కార్చిచ్చు మృతులు
సాలెం : అమెరికాలోని పశ్చిమ తీర రాష్ట్రాల్లో రేగుతున్న అటవీ కార్చిచ్చు కల్లోలం సష్టిస్తుంది. ఇప్పటికే కాలిఫోర్నియా, ఓరేగాన్, ఇతర రాష్రాల్లో మంటల ధాటికి 31 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో కార్చిచ్చుతో వస్తున్న పొగ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లక్షలాది మంది ప్రజలపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వరుసగా సంభవిస్తున్న ఈ మంటల విపత్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు అగ్నిమాపక దళాలు కషి చేస్తున్నాయి. తాజాగా శనివారం పలు ప్రాంతాల్లోని వేలాది మందిని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటల బూడిదలో మరికొన్ని మతదేహాలు కనిపించే అవకాశం ఉందని ఓరేగాన్ అత్యవసర నిర్వహణ విభాగం డైరెక్టర్ చెప్పారు. వాయు కాలుష్యం చరిత్రలోనే గరిష్ట స్థాయికి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. పొగ బారి నుంచి తప్పించుకునేందుకు డోర్ల కింద ఉండే ఖాళీల్లో టవళ్లను కుక్కుతున్నారు. కొంత మంది ఇండ్లలో ఉంటూనే ఎన్-95 మాస్కులను ధరిస్తున్నారు. రెం ప్రపంచ యుద్ధంలో బాంబు పేలుళ్ల సమయంలో యూరప్ నగరాలను ఆవరించిన విధంగా తాజా కార్చిచ్చు పొగ కొన్ని ప్రాంతాలను కప్పేశాయి. ఓరేగాన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 35 ఏండ్లలో ఎన్నడూలేని విధంగా వాయుకాలుష్యం ఏర్పడింది. రాష్ట్ర రాజధాని సాలెంలో శనివారం ఉదయం వాయు నాణ్యత సూచి 512గా ఉంది. ఓరేగాన్లో ఇప్పటికే 40 వేల మందిని ఖాళీ చేయించారు. ఇంకా 5 లక్షల మంది తరలింపునకు సంబంధించి వివిధ దశల్లో ఉన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి, దాని ఫలితంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం, జాతివివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటున్న అమెరికా పౌరులకు ఈ మంటలు దు:ఖంలో కొత్త పొరను చేర్చాయి. భవిష్యత్తులో ఇంకేం విపత్తులు రానున్నాయో అని నైరుతి పోర్టుల్యాండ్లోని హ్యపీ వ్యాలీకి చెందిన డానియెల్ ఓలివర్ ఆవేదన వ్యక్తం చేశారు.