Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధనిక దేశాలను కోరిన డబ్ల్యుహెచ్ఓ చీఫ్
జ్యూరిచ్ : రోగ నిరోధక మందులను పారదర్శకంగా, సమర్ధవంతంగా పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) రూపొందిన కోవాక్స వ్యాక్సిన్ స్కీమ్లో శుక్రవారంలోగా చేరాలని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ధనిక దేశాలను కోరారు. సోమవారం వర్చువల్ రూపంలో జరిగిన డబ్ల్యుహెచ్ఓ యూరప్ ప్రాంతీయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్లు, చికిత్సా విధానాలు, పరిశోధనలను అభివద్ధి చేసేందుకు డబ్ల్యుహెచ్ఓ కార్యచరణలో భాగంగా తీసుకువచ్చిన కోవాక్స సదుపాయం ద్వారా ఇప్పటికే అల్పాభివద్ధి, తక్కువ ఆదాయం ఉన్న 92 దేశాలు సాయం కోరాయని చెప్పారు. ఇంకా 80 ధనిక దేశాలు ఆసక్తి చూపాయని, అయితే స్కీమ్లో చేరేందుకు వారి ఉద్దేశాన్ని ఇంకా ధ్రువీకరించలేదని, ఇందుకుగానూ ఈ వారం చివరి వరకూ సమయం ఉందన్నారు. అల్ప, మధ్యస్థాయి ఆదాయం ఉండే దేశాలు వ్యాక్సిన్లను గనుక పొందకపోతే వైరస్ ఆయా దేశాల్లో ప్రజలను పొట్టనపెట్టుకుందని, తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమనం ఆలస్యమౌతుందని పేర్కొన్నారు.