Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామొల్ల : బహ్రెయిన్, యూఏఈ, అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయిల్తో 'సాధారణీకరణ' పేరుతో చేసుకున్న ఒప్పందాన్ని పాలస్తీనా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తంచేస్తున్నారు. పాలస్తీనియన్లు కోరుకుంటున్న శాంతికి ఈ ఒప్పందం భంగం కలిగిస్తుందని వారు విమర్శిస్తున్నారు. ఆక్రమణదారులతో ఒప్పందం ఎందుకనేది ముందుకు వస్తున్న ప్రశ్న. నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ ఈ ఒప్పందం జరిపించాడనేది ప్రధాన ఆరోపణ. రామొల్ల, నెబల్స్, హెజ్రోన్ లాంటి నగరాల్లో ప్రజలు జెండాలు, ప్లకార్డులు పట్టుకొని నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ''ఆక్రమణదారులతో శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాం'', ''ఈ ఒప్పందం సిగ్గుమాలినది'' అని పెద్దఎత్తున నినాదాలు చేశారు. కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా వాటిని లెక్కచేయకుండా వేలాదిమంది పాలస్తీనియన్లు నిరససనలో పాల్గొన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లోని వైట్ హౌస్ ముందు దాదాపు 50 సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి.