Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాస్ ఏంజెల్స్ : హిందూ మహా సముద్రం వేడెక్కడానికి గల కారణాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు. సముద్రాలలో భూకంపాలు సంభవించినప్పుడు వచ్చే శబ్దాన్ని విశ్లేషించడం ద్వారా హిందూ మహా సముద్రం ఎంత త్వరగా వేడెక్కుతుందోననే విషయాన్ని తెలుసకుంటున్నారు. ఇది అన్ని మహా సముద్రాలలో నీటి ఉష్ణోగ్రతను లెక్కించడానికి ఉపయోగిస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ మేరకు పలు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. భూమిపై ఉన్న గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల కారణంగా సంద్రాలు మరింత వేడెక్కుతున్నాయని వారు వివరించారు. 2005 నుంచి 2016 మధ్యకాలంలో భూమధ్యరేఖ వెంబడి హిందూ మహాసముద్రంలో 3 వేల కిలోమీటర్ల పొడవైన విభాగాన్ని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. అయితే ఇది గత అంచనాల కంటే 70 శాతం మించిపోయిందని వారు తెలిపారు. ఇక సముద్రంలో భూకంపాలు సంభవించినప్పుడు ధ్వని తరంగాలు భూమి గుండా ప్రయాణిస్తాయనీ, అయితే ఆ శక్తిలో కొంతభాగం నీటిలోకి వ్యాపిస్తుందని వారు వివరించారు. భూమి తరంగాలు ముందు భూకంప కేంద్రానికి వస్తాయి. తర్వాత శబ్ద తరంగాలు ద్వితీయసంకేతంగా వస్తాయి. అయితే ఇది చాలా తక్కువ వ్యవధిలో..మెరుపు సెకండ్లలోనే మారుతుందని పరిశోధకులు అన్నారు. నీటి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీటిలో ధ్వని వేగం పెరుగుతుందని వారు వివరించారు. 2004 నుంచి హిందూ మహా సముద్రంలో సిస్మో మీటర్ను ఉపయోగించి దీనిని కొలుస్తున్నామని పరిశోధకులు తెలిపారు.