Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్మనీ ప్రభుత్వ రంగ కార్మికుల ఆందోళనలు
బెర్లిన్ : తమ వేతనాలు గణనీయంగా పెంచాలని కోరుతూ జర్మనీ ప్రభుత్వ రంగ కార్మికులు ఆందోళనలకు దిగారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారు తమ డిమాండ్ సాధనకు గానూ వాకౌట్లు నిర్వహించారు. ఆస్పత్రి, బాలల సంరక్షణ, డ్రెయినేజీ రంగాలతో సహా పలు రంగాలకు చెందిన కార్మికులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది కల్లా దాదాపు 23లక్షల మంది ఫెడరల్, స్థానిక ఉద్యోగులు, కార్మికులకు నెలకు 150 యూరోలు లేదా 4.8శాతం వేతన పెరుగుదల వుండాలని యునైటెడ్ సర్వీసెస్ యూనియన్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. కాగా యాజమాన్యాల తరఫు ప్రతినిధులు ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనతో ముందుకు రాలేదు. కరోనా వైరస్తో ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కార్మికుల వేతన డిమాండ్లు చాలా ఎక్కువగా వున్నాయని వారు పేర్కొంటున్నారు. దీర్ఘకాలం కొనసాగేలా ఒప్పందం చేసుకోవాలని వారు కోరుతున్నారు. కరోనా వల్ల ప్రభుత్వ పన్నుల వసూళ్ళు కూడా తగ్గిపోయాయన్నారు. గత వారాంతంలో జరిగిన చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో యూనియన్ నేతలు వెంటనే వాకౌట్లకు పిలుపిచ్చారు. ఈ వాకౌట్లు కేవలం ప్రభుత్వానికి హెచ్చరిక మాత్రమేనని రాబోయే రోజుల్లో తమ ఆందోళనలు ఉధృతమవుతాయని యూనియన్ చైర్మన్ ఫ్రాంక్ వెర్నెకె మీడియాకు తెలిపారు. ఆస్పత్రుల్లో చాలా ఒత్తిడి వుంటోందనీ, అందువల్ల ముందుగా అక్కడ దృష్టి పెట్టాలని ఆయన కోరారు. తదుపరి చర్చలు అక్టోబరు 23, 24 తేదీల్లో జరగాల్సి వున్నాయి.