Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టాకహేోం : ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక అవార్డు అయిన నోబెల్ గ్రహీతలకు బహుమతితో పాటు ఇచ్చే నగదును ఈ ఏడాది 90 లక్షల క్రోనార్ల(స్వీడన్ కరెన్సీ) నుంచి కోటి కోనార్ల( భారత కరెన్సీలో దాదాపు రూ.8.13 కోట్లు)లకు పెంచనున్నట్టు నోబెల్ ఫౌండేషన్ వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫౌండేషన్ ఆర్థిక సామర్ధ్యాన్ని బలోపేతం చేసేందుకు గత కొన్ని సంవత్సరాలుగా కషి చేశామని, దీంతో నగదు బహుమతిని పెంచే వీలు కలిగిందని పేర్కొంది. ఈ ఏడాదికి సంబంధించి వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో నోబెల్ బహుమతులను అక్టోబర్ 5వ తేదీన ప్రకటించే అవకాశం ఉందని ఫౌండేషన్ ఈ సందర్భంగా తెలిపింది. ఫౌండేషన్ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే కార్యాచరణ తీసుకున్న క్రమంలో 2011లో నగదు బహుమతిని కోటి క్రోనార్ల నుంచి 80 లక్షల కోనార్ల(రూ.8.13 కోట్ల నుంచి రూ.6.5 కోట్లు)కు తగ్గించారు.