Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరస్పరం ఆరోపణల అస్త్రాలు..
- మాటల తూటాలతో వాడిగా వేడిగా జరిగిన సమావేశం
ఐక్యరాజ్య సమితి : ప్రపంచ దేశాలను గడగడలా డిస్తున్న కరోనా వైరస్పై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన తీరుపై చైనా, అమెరికా, రష్యాలు ఘర్షణ పడ్డాయి. ఐక్యరాజ్య సమితి వేదికగా ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వైరస్ను ఎదుర్కొనడంలో సరిగా వ్యవహరించలేదని, రాజకీయం చేశారని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భద్రతా మండలి మంత్రివర్గ స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇప్పటికీ అదుపు లోనిరాని ఈ పరిస్థితిని ఎదుర్కొనడంలో అంతర్జాతీయ సహకారం కొరవడిందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ''కరోనా అనంతర ప్రపంచ పాలన'' అనే అంశంపై జరిగిన వీడియో సమావేశం చివరిలో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వీటో అధికారమున్న ముగ్గురు మండలి సభ్య దేశాల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొదటగా చైనాన విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి కేంద్రంగా బహుళపక్ష వాదం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. కరోనా వ్యాక్సిన్ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలం టే అమెరికాతో సహా అన్నిదేశాలను దూరంగా వుంచాలని సూచించారు. సవాళ్లు విసురుతున్న ఇలాంటి తరుణంలో ప్రధాన దేశాలు మరింత కర్తవ్య దీక్షతో తమ బాధ్యతల పట్ల మెలకువగా వ్యవహరించాలని వాంగ్ పేర్కొన్నారు. మాన వాళి భవిష్యత్కు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రచ్ఛన్న యుద్దం మనస్వత్వాలను విడనాడి, సైద్ధాంతిక విభేదాలను పక్కకు పెట్టి ఈ కష్టాలను అధిగమించేందుకు భాగస్వామ్య స్ఫూర్తితో ఒక తాటిపైకి రావాలని ఆకాంక్షించారు. రష్యా, సిరియాలతో సహా పలు దేశాలపై అమెరికా, యురోపియన్ యూనియన్ ఆంక్షలను పరోక్షంగా విమర్శిస్తూ, అంతర్జాతీ యచట్టాల అధికారాన్ని, పవిత్రతను కాపాడేందుకు గానూ ఇటువంటి ఏకపక్ష ఆంక్షలను, న్యాయ పరిధికి వెలుపల చేపట్టే చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత వుందన్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లవ్రోవ్ మాట్లాడుతూ, కరోనా వంటి కొత్త సమస్యలుఉ తలెత్తినా దానివల్ల మన దేశాల మధ్య విభేదాలు పరిష్కారం కాలేదని, పైపెచ్చు ఒకరిపై ఒకరు ఆధారపడడం మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. తమ అంతర్గత సమస్యలకు బయట ఎవరు కారణమా అని పరికించి చూసే ఒక వైఖరి చాలా దేశాల్లో కనిపిస్తూ వుంటుందని అన్నారు. తమ సంకుచిత ప్రయోజనాను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు కొన్ని దేశాలు ప్రస్తుత పరిస్థితిని ఉపయోగించుకుంచుకోవడం మనం చూస్తున్నామని అన్నారు. సమావేశం చివరిలో ఐరాసలో అమెరికా రాయబారి కెల్లీ క్రాఫ్ట్ చాలా పదునుగా దురుసుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ''మీ అందరినీ చూస్తుంటే సిగ్గువేస్తోంది. ఈనాటి సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తోంది.'' అని క్రాఫ్ట్ పేర్కొన్నారు. కొంతమంది ప్రతినిధులు ఈ అవకాశాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ''అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఒక విషయం స్పష్టం చేశారు : ఏది సరైనది అనుకుంటే అది చేసి తీరుతాం, అదెంత ప్రజా వ్యతిరేకమైనదైనా సరే, ఎందుకంటే ఇదేమీ ప్రజాదరణ పొందే పరీక్ష కాదని మీకు స్పష్టం చేయదలచుకున్నా.'' అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంగళవారం నాటి ట్రంప్ ప్రసంగంలోని కొన్ని వ్యాక్యాలను ఆమె ఉదహరించారు. ''ఈ అంటువ్యాధిని ప్రపంచంపైకి వదిలిన దేశాన్ని ఇందుకు జవాబుదారీ చేయాల్సి వుంది.' అని ట్రంప్ పేర్కొన్నారని అన్నారు. ''వైరస్ మూలాలు ఎక్కడ అనేది దాచిపెట్టి, దాని ప్రమాదాన్ని తగ్గించి చూపి, శాస్త్రీయ సహకారాన్ని అణచివేసి, స్థానికంగా వుండాల్సిన వ్యాధిని ప్రపంచమంతా విస్తరించే అంటువ్యాధిగా మార్చాలని చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుందని క్రాఫ్ట్ పేర్కొన్నారు. సభ్య దేశాలన్నీ ఒకే రీతిన ప్రజారోగ్యానికి, పారదర్శకతకు, అంతర్జాతీయ కర్తవ్యాలు, బాధ్యతలకు కట్టుబడి వుండనవసరం లేదని రుజువు చేశాయని అన్నారు.
అయితే ఈ కరోనా నుండి మనం నేర్చుకున్నది ఒక్కటే ఐక్యత అవసరం, విభేదాలు కాదు అని అన్నారు. మంచి విశ్వాసంతో పారదర్శకతతో అందరం కలిసి కృషి చేయాలని కోరారు. చివరగా చైనా రాయబారి ఝంగ్జున్ మాట్లాడుతూ, అమెరికా నిరాధారంగా చేసిన ఆరోపణలను చైనా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోందని స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి వేదికలను కలుషితం చేసేలా అమెరికా రాజకీయ వైరస్ను వ్యాప్తి చేస్తోందని, తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని, ఘర్షణలు, అభిప్రాయ భేదాలు సృష్టించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. క్రాఫ్ట్ నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు రష్యా రాయబారి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రారంభోపన్యాసం గుటెరస్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాల్లో సన్నద్ధత కొరవడడం, సహకారం, ఐక్యత, సంఘీభావం లేకపోవడం వల్లనే ప్రస్తుత వైఫల్యం ఎదురైందని వ్యాఖ్యానించారు.