Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22 మంది దుర్మరణం
కైవ్ : ఉక్రెయిన్లో ఘోర ప్రమాదం జరిగింది. వైమానిక దళానికి చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 22 మంది మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయం వెల్లడించింది. విమానం కూలిపోయిన సమయంలో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నారనీ, వారిలో 21 మంది సైనిక విద్యార్థులు కాగా, ఏడుగురు విమాన సిబ్బంది అని మంత్రి ఆంటోనీ గెరాష్చెంకో తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్క్సీ అన్నారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.