Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : చైనా, రష్యాలను కలుపుతూ హీలాంగ్ నదిపై నిర్మించిన తొలి హైవే బ్రిడ్జి రాకపోకలకు సిద్ధమైంది. రెండు దేశాల మధ్య ప్రజల రాకపోకలకు, సరుకుల రవాణాకు ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈశాన్య చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్లోని హీహెలో ఈ వంతెన వుంది. 19.9 కిలోమీటర్లు పొడవున్న ఈ వంతెనలో మూడో వంతు చైనాలో వుంది. చైనా సరిహద్దు నగరమైన హీహెను రష్యా నగరమైన బ్లాగొవెచెన్స్క్తో ఈ వంతెన కలుపుతోంది. దీని నిర్మాణానికి 247కోట్ల యువాన్లు(36.10కోట్ల డాలర్లు) ఖర్చయింది. 2016 డిసెంబరులో వంతెన నిర్మాణాన్ని చేపట్టగా 2019 చివరినాటికి పూర్తయింది. ఈ వంతెనపై ఏటా 10.48లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు, 30లక్షల మెట్రిక్ టన్నుల సరుకుల రవాణాకు వీలుకలగవచ్చని భావిస్తున్నారు.