Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : లండన్లో కరోనా ఆంక్షలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఒక మహిళ పట్ల లండన్ పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం కెమెరా కంటికి చిక్కింది. ఆ ఫుటేజ్ ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ''వి డు నాట్ కన్సెంట్' పేరుతో శనివారం నాడు ట్రాఫాల్గార్ స్క్వేర్ వద్ద ఆందోళనకారులు ర్యాలీ జరుపుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి రావడానికి ముందుగా ఆ మహిళ ఒక కుర్చీపై నిలుచుంది. ఈలోపు అక్కడకు వచ్చిన పోలీసులు ఆమె నిల్చున్న కుర్చీని లాగివేశారు. దాంతో ఆమె కిందపడిపోయింది. నడివయస్సులో వున్న ఆ మహిళ దీనిపై ఒక పోలీసు అధికారితో గొడవపడింది. ఈ పరిస్థితుల్లో ఆ అధికారి ఆమెను గట్టిగా ఒక తోపు తోశాడు. దాంతో ఆమె నేలకి కొట్టుకుంది. ఈలోగా అక్కడున్న ఆందోళనకారులు ఆ పోలీసుతో గొడవపడడం కనిపించింది. ఆదివారం ట్విట్టర్, ఫేస్బుక్లతో సహా సోషల్ మీడియాలో ఈ ఫుటేజ్ చక్కర్లు కొట్టింది. బ్రిటన్ రాజధానిలో ప్రభుత్వం విధించిన కరోనా మార్గదర్శక సూత్రాలను నిరసిస్తూ వరుసగా రెండో వారం కూడా ట్రాఫాల్గార్ స్క్వేర్ వద్ద ఆందోళనలు కొనసాగాయి. వేలాదిమంది ప్రదర్శకులు అక్కడకు చేరారు. ఈ ర్యాలీ ఆమోదయోగ్యం కాదంటూ లండన్ మేయర్ సాదిక్ ఖాన్ విమర్శించడంతో ఆయనపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి.