Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్లోరిడాలోని ఓటర్లను మభ్యపెట్టేందుకే..బ్రునో రోడ్రిగుజ్
హవానా: క్యూబాపై వ్యతిరేకంగా కొత్త ఆంక్షల విధింపునకు సంబంధించి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చేసిన ప్రకటనను ఆ దేశ విదేశాంగ మంత్రి బ్రునో రోడ్రిగుజ్ ఖండించారు. ఈ మేరకు సొమవారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఏఐఎస్ రెమాసెస్ క్యూబా కంపెనీకు వ్యతిరేకంగా అమెరికా విధించిన ఆంక్షలతో తమ దేశ ప్రజలకు తీవ్ర నష్టం చేకూరుతుందన్నారు. ఈ కంపెనీ ద్వారా క్యూబాలోని తమ బంధువులకు డబ్బులు పంపించేందుకు అవకాశం ఉంది. ఫ్లోరిడాలోని ఓటర్లను మభ్యపెట్టేందుకు ఆర్థిక అడ్డంకులను మరింత పెంచేందుకు అమెరికా ప్రయత్నం చేస్తోందని బ్రునో విమర్శించారు. అమెరికా చర్యలు ఇరుదేశాల్లోని కుటుంబాలను ఏకం చేసే సంబంధాలను దెబ్బతీస్తుందని అన్నారు. ఏఐఎస్(అమెరికన్ ఇంటర్నేషనల్ సర్వీసెస్)కు వ్యతిరేకంగా ఆంక్షలపై నిర్ణయం తీసుకున్నట్టు పాంపియో ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ కంపెనీని క్యూబా మిలటరీ నియంత్రిస్తోందనీ, ఇది చెల్లింపుల నుంచి నగదును దోచుకుంటోందని ఆరోపించారు. ఇప్పటికే క్యూబాకు చెందిన దాదాపు 200 సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ సంస్థలతో ఎటువంటి లావాదేవీలు నిర్వహించొద్దని అమెరికా పౌరులకు ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.