Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా నేతలకు చైనా హెచ్చరిక
బీజింగ్ : అమెరికా అంతర్గత వ్యవహారాల్లోకి తమను లాగొద్దని ఆ దేశానికి చెందిన నేతలను చైనా హెచ్చరించింది. ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు చీప్ట్రిక్స్ను ప్రదర్శించొద్దని సూచించింది. చైనా బెదిరింపులకు పాల్పడుతోందనీ, ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందని నేతలు చేస్తున్న ప్రచారాన్ని కట్టిపెట్టాలని పేర్కొంది. అధ్యక్ష్య ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తిగా ఆ దేశ అంతర్గత వ్యవహారమనీ, ఇందులో చైనాకు ఎటువంటి పాత్ర లేదని చైనీస్ కమ్యూనిస్టు పార్టీ మౌత్పీస్ పీపుల్స్ డైలీ ఒక కథనాన్ని ప్రచురించింది. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ట్రంప్, బిడెన్ల మధ్య డిబేట్ జరిగేందుకు కొన్ని గంటల ముందు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరికీ ప్రచారం కోసం చైనా అనేది ఒక కేంద్ర బిందువుగా మారిందని పేర్కొంది. టిక్ట్యాక్పై నిషేధం విధించాలన్నఆలోచనతో ట్రంప్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బెదిరింపు వైఖరిని ప్రదర్శిస్తోందని పీపుల్స్ డైలీ విమర్శించింది.