Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 మంది పౌరులు మతి
కాబూల్ : సెంట్రల్ ఆఫ్ఘనిస్థాన్లో మంగళవారం బాంబు పేలుడు సంభవించింది. రహదారి వెంబడి దుండగులు జరిపిన ఈ బాంబు(రోడ్సైడ్ బాంబ్) దాడిలో 14 మంది పౌరులు మతిచెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మతుల్లో ఏడుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు, ఇద్దరు పురుషులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. అనేక సంవత్సరాల ఘర్షణ అనంతరం ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. బాధితులకు చెందిన వాహనం ఈ పేలుడు గురైందని, దైకుండి ప్రావిన్సులో ఈ ఘటన సంభవించిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తారిఖ్ అరియాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ దాడి తాలిబన్లకు చెందిన వ్యక్తులే పాల్పడివుంటారని ఆరోపించారు. ఘటనకు సంబంధించి దైకుండి గవర్నర్ అధికార ప్రతినిధి నారుల్లా ఘోరి ఎఎఫ్పి వార్తా సంస్థతో మాట్లాడుతూ బాధితులు ఒక మినీబస్సులో పుణ్యక్షేత్రాలకు వెళ్లుండగా ఈ పేలుడు జరిగిందని తెలిపారు. అయితే ఈ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ నుంచి కూడా ప్రకటన రాలేదని స్థానిక మీడియా తెలిపింది. అయితే తాలిబన్లు ఈ రోడ్సైడ్ బాంబులను ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని పేర్కొంది. 2020 ప్రథమార్ధంలో పౌరులే లక్ష్యంగా జరిగిన దాడుల్లో దాదాపు 800 మంది పైగా మరణించడంతో పాటు గాయాలయ్యాయని ఐరాస జులైలో విడుదల చేసిన నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే.