Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కేసుల్లో తప్పుడు లెక్కలు
- వాతావరణ కాలుష్యానికి కారణం
- హోరాహోరీగా ట్రంప్, బైడెన్ డిబేట్
- నోర్మూయ్...మొరటోడు అంటూ..
- అమెరికాలో అధ్యక్ష అభ్యర్థుల మధ్య టగ్గాఫ్వార్
క్లీవ్ లాండ్: 'కరోనా పట్ల అప్రమత్తంగా ఉన్నామని, అందుకే దేశంలో మరణాలను తగ్గించగలిగాం, లేదంటే 20 లక్షల మంది చని పోయేవారు. భారత్లో కరోనాతో చనిపోయిన వారి వాస్తవ లెక్కలు చెప్పడం లేదు. ఇదే పరిస్థితి రష్యా, చైనా తదితర దేశాల్లో చేస్తున్నారు.' అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. వాతావరణ కాలుష్యానికి కారణం భారత్ అని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు. ఇండియాను మిత్ర దేశంగా, ప్రధాని మోడీ మంచి దోస్త్గా పలుమార్లు అభివర్ణించిన ఆయన నోటినుంచే భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో.. అధ్యక్ష అభ్యర్థులిద్దరూ మాటల కత్తులు దూసుకున్నారు. రిపబ్లికన్ అభ్యర్థిగా అమెరికా అధ్యక్షు డు ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థిగా జో బిడెన్లు బరిలో ఉన్న సంగతి విదితమే. ట్రంప్, బైడెన్ మధ్య తొలి అధ్యక్ష చర్చ భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.30గంటలకు ప్రారంభమైంది. ఇద్ద రూ హోరాహోరీగా పలు అంశాలపై పోటీపడ్డారు. ఒకరిపై ఒకరు నిం దలు వేసుకుంటూ.. చర్చలో నిప్పులు చెరిగారు. భారత్, రష్యా, చైనాలో కరోనాతో చనిపోయిన వారి వాస్తవ లెక్కలు చెప్పడం లేదని విమర్శిం చారు. అమెరికాలో తమ పనితీరు బాగుందనడానికి ఫౌచీ ప్రశంసలే నిదర్శమని ట్రంప్ చెప్పారు. కరోనాను ఎదుర్కొవడంలో ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని బిడెన్ వ్యాఖ్యానించారు. కరోనాపై కట్టడి చేసే ఎటువంటి చర్యలు ఆయన తీసుకోకపోవడంతోనే ఇంతటి అనర్థం జరి గిందని ఎదురుదాడి చేశారు. పర్యావరణం విషయంలో పారిస్ ఒప్పం దం సరైనది కాదని ట్రంప్ అన్నారు. ట్రంప్ అభిప్రాయాలు పూర్తిగా తప్పని బిడెన్ కొట్టిపారేశారు.