Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లూయిస్గ్లక్ ను వరించిన అవార్డు
స్టాక్ హౌం: సాహిత్య రంగంలో ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన కవయిత్రి లూయిస్ గ్లక్ను వరించి నట్టు స్వీడన్ అకాడమీ గురువారం ప్రకటించింది. 1943లో న్యూయా ర్క్లో జన్మించిన లూయిస్.. కనెక్టికట్లోని యాలే యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 1968లో ఫస్ట్బార్న్ పేరుతో తొలి కవిత రాసిన లూయిస్.. కొద్ది కాలంలో అమెరికా సాహిత్యరంగంలో ప్రముఖ కవయిత్రిగా పేరు సంపాదించారు. తన కవితలతో ఆమె ఎంతోమందిని ప్రభావితం చేశారు. ప్రఖ్యాత పులిట్జర్ పురస్కారం, నేషనల్ బుక్ అవార్డ్ వంటి ఎన్నో పురస్కారాలు దక్కాయి. లూయిస్ రాసిన ది వైల్డ్ ఐరిష్ కవితకు 1993లో పులిట్జర్ అవార్డును అందుకున్నారు. కాగా నోబెల్ సాహిత్య పురస్కారాలపై గతంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పురస్కారాల విజేతలను ఎంపిక చేసే స్వీడిష్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో 2018లో సాహిత్య రంగంలో నోబెల్ ప్రకటనను వాయిదా వేశారు. ఆ తర్వాత గతేడాది 2018, 2019 సంవత్సరాలకు గానూ రెండు పురస్కారాలను ఒకేసారి ప్రకటించారు. 2018 ఏడాదికి గానూ పొలాండ్కు చెందిన ప్రముఖ కవయిత్రి ఓల్గాకు పురస్కారం దక్కింది. 1901 నుంచి ఇప్పటివరకు సాహిత్య రంగంలో 117 మంది నోబెల్ ఇవ్వగా.. వీరిలో మహిళలు 16 మంది ఉన్నారు.