Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో స్థానంలో గౌతమ్ అదానీ
- ఫోర్బ్స్ ఇండియా ధనవంతుల జాబితాలో మోడీ సన్నిహిత కార్పొరేట్లు
న్యూయార్క్ : కరోనా కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ ఓ వైపు కుప్పకూలిపోతుంటే.. దేశంలో కుబేరుల సంపద మాత్రం హద్దులు లేకుండా పెరిగింది. అంతర్జాతీయ మాగజైన్ ఫోర్బ్స్ 2020 ఏడాదికి గాను అత్యంత సంపద కలిగిన 100 మంది భారత కుబేరుల జాబితాను గురువారం వెల్లడించింది. వీరి మొత్తం సంపద 517.5 బిలియన్ డాలర్లుగా (దాదాపుగా రూ.37.91 లక్షల కోట్లు)గా ఉంది. గతేడాదితో పోలిస్తే వీరి సంపద 14 శాతం పెరిగింది. కరోనా కాలంలో సాధారణ ప్రజల ఆదాయాలు అమాంతం పడిపోయినప్పటికీ.. ఈ కుబేరుల సంపద భారీగా పెరగడ విశేషం. మోడీ సన్నిహిత కార్పొరేట్లు మాత్రం అన్ని సర్వేల్లోనూ పైనే ఉంటున్నారు. తాజాగా ఫోర్ట్స్ జాబితాలో రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముకేశ్ అంబానీ 88.7బిలియన్ డాలర్ల (రూ.6.65లక్షలకోట్లు) ఆదా యంతో వరుసగా 13వ ఏడాదిలోనూ అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాదిముకేశ్ సంపద 37.3బిలియన్ డాలర్ల (రూ.2.79లక్షలకోట్లు) పెరిగింది. గౌతమ్ అదానీ ఆదాయం 61శాతం పెరిగి 25.2 బిలియన్ డాలర్లకు చేరడంతో రెండో స్థానంలో ఉన్నారు. తర్వాత వరుస స్థానాల్లో హెచ్సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివనాడార్, డిమార్ట్స్ అధినేత రాధాకిషన్ ధమానీ, హిందూజా సోదరులు నిలిచారు.