Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి
సిడ్నీ : ప్రపంచవ్యాప్తంగా సముద్ర జలాల్లో దాదాపు కోటీ 40లక్షల టన్నుల మేరకు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు ఆస్ట్రేలియా జాతీయ సైన్స్ సంస్థ కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండిస్టియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సిఎస్ఐఆర్ఓ) కనుగొంది.
సముద్ర గర్భంలో మైక్రో ప్లాస్టిక్ కాలుష్యం ఏ మేరకు వుందో అంచనా వేయడానికి ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఆస్ట్రేలియాలోని దక్షిణ తీర ప్రాంతంలో రొబోటిక్ జలాంతర్గామి ద్వారా మారుమూల ప్రాంతాల్లో సేకరించిన నమూనాలను విశ్లేషించి చూడగా భూ ఉపరితలాన్ని మించి రెట్టింపు సముద్ర జలాలు కాలుష్యమయ్యాయని కనుగొన్నారు.
గతంలో సముద్ర భూగర్భంలో జరిపిన అధ్యయనాల్లో బయటపడిన దానికి 25రెట్లు అధికంగా మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయినట్లు తాజా సర్వే వెల్లడించింది. సముద్ర జలాల్లోకి వెళ్ళిన ప్లాస్టిక్ అంతా క్రమంగా క్షీణించి, ముక్కలై చివరకు మైక్రో ప్లాస్టిక్స్గా తయారవుతోందని ఈ అధ్యయన రూపకర్త జస్టిన్ బారెట్ ఒక ప్రకటనలో తెలిపారు.