Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవాజ్ షరీఫ్ ను ఆదేశించిన కోర్టు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను నవంబరు 24న కోర్టుకు హాజరు కావాల్సిందిగా పాకిస్తానీ కోర్టు ఆదేశించింది. లండన్ లోని తన నివాసానికి వచ్చిన నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లను అందుకోవడానికి షరీఫ్ తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఆయనను అపరాధిగా ప్రకటించకుండా వుండాలంటే కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. లండన్లోని షరీఫ్ నివాసంలో ఆయన ప్రతినిధుల వ్యవహార తీరుపై ఆగ్రహించిన హైకోర్టు, వెంటనే ఆయనకు ఈ సమన్లు జారీ చేసింది. నవంబరు 24న కోర్టుకు హాజరు కావాలని, లేనిపక్షంలో ప్రొక్లెయిమ్డ్ అఫెండర్గా ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. ఇదే గనుక జరిగితే ఆయన ఆస్తులను, పాస్పోర్టును జప్తు చేసే అవకాశముంది.