Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా : ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్ పి)ని క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్ కానెల్ అభినందించారు. దశాబ్దాల పాటు తమ దేశానికి అద్భుతమైన సహకారాన్ని అందించినందుకు ఆ సంస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆకలిపై పోరాడుతూ, యుద్ధానికి ఒక ఆయుధంగా మారకుండా నివారించేందుకు, ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో శాంతి స్థాపనకు అది చేసిన కృషి అమోఘమని కొనియాడింది. శరణార్ధులకు, యుద్ధాల వల్ల నిర్వాసితులైన వారికి ఆహారాన్ని అందించిన ఈ సంస్థ అభివృద్ధి ప్రాజెక్టులకు తోడ్పాటునిచ్చింది. 1901-2019 మధ్య నోబెల్ శాంతి బహుమతి వందసార్లు ఇచ్చారు. దీనిని అందుకున్న వారిలో 134 మంది వ్యక్తులు, 27 సంస్థలు ఉన్నాయి.