Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంథోనీ ఫౌసి వ్యాఖ్యలు
వాషింగ్టన్ : గత నెల 26న వైట్హౌస్లో జరిగిన కార్యక్రమాన్ని ''సూపర్స్ప్రెడర్ ఈవెంట్''గా అమెరికా అంటువ్యాధుల విభాగం నిపుణుడు ఆంథోనీ ఫౌసి వ్యాఖ్యానించారు. ట్రంప్తో సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇందుకు సంబంధించిన డేటాను పరిశీలిస్తేనే ఈ విషయం స్పష్టమవుతున్నదన్నారు. సీబీఎస్ న్యూస్ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖానికి మాస్కులు ధరించకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. వైట్హౌస్ కార్యక్రమం తర్వాత ట్రంప్ దంపతులు, సీనియర్ సలహాదారు హౌప్ హిక్స్, పత్రికా కార్యదర్శి కేలెగ్ మెకనీతో సహా దాదాపు 30మందికి ఈ వైరస్ సోకింది. కరోనా డేటాకు సంబంధించి అమెరికాలో అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిగా ఫౌసిని భావిస్తున్నారు. సంక్షోభం ముదురుతూ వస్తున్న ప్రతి సారి ఆయన ట్రంప్ను సరిదిద్దుతునే వున్నారు. ఇదిలావుండగా, పది రోజుల పాటు ఆస్పత్రికి, వైట్హౌస్కే పరిమితమైన ట్రంప్ శనివారం నుంచి తిరిగి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాలని భావిస్తున్నారనీ ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ తెలిపారు. శారీరకంగా ఆయన ఫిట్గానే వున్నారనీ, ఎలాంటి అస్వస్థతా సూచనలు లేవని డాక్టర్ సియాన్ కాన్లే చెప్పారు. సోమవారం ఫ్లోరిడాలో జరిగే ర్యాలీలో ఆయన పాల్గొంటారని భావిస్తున్నారు. ఇద్దరు అధ్యక్ష అభ్యర్థుల మధ్య ఈ నెల 15నజరగాల్సిన రెండవ డిబేట్ను రద్దు చేశారు. ట్రంప్ కరోనా నుంచి పూర్తిగా బయటపడకపోవడమే ఇందుకు కారణం. ఆన్లైన్లో చర్చకు బిడెన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించడంతో దీన్ని రద్దు చేశామని నిర్వాహకులు తెలిపారు. మూడవది యధావిధిగా 22న జరుగుతుందని వారు చెప్పారు.