Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా చికిత్స అనంతరం ప్రజల ముందు ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: ''డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ అధికారంలోకి వస్తే అమెరికాను సోషలిస్టు దేశంగా మారుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వమ''ని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇటీవల కరోనా బారినపడిన ట్రంప్.. చికిత్స అనంతరం తొమ్మిది రోజుల తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మద్దతుదారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సౌత్లాన్లోని వైట్హౌస్ బాల్కానీలో నిలబడి మాట్లాడుతూ.. ''నేను ఈ సమయాన్ని గొప్పగా ఫీలవుతున్నాను. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. బయటకు వెళ్లి ఓటు వేయండి'' అంటూ మద్దతుదారులను ఉత్సాహపరిచారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టుగానే కనిపిస్తూ... ఎలాంటి ఇబ్బంది లేకుండా కరోనా సోకడానికి ముందు తరహాలోనే ప్రసంగాన్ని కొనసాగించారు.