Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ వలంటీర్ లో అంతుచిక్కని అనారోగ్యం
వాషింగ్టన్ : ఓ వలంటీర్ లో అంతుచిక్కని అనారోగ్య సమస్య తలెత్తడంతో 'జాన్సన్ అండ్ జాన్సన్' తయారుచేసిన వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిచిపోయాయి. అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వైరస్ను అరికట్టేందుకు వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. కేవలం ఒక్క డోసుతోనే తమ కరోనా టీకా సానుకూల ఫలితాలిస్తున్నట్టు ఇటీవల ఆ కంపెనీ ప్రకటించింది. దాంతో వ్యాక్సిన్పై అందరికీ ఆశలు రేకెత్తాయి. అయితే ఊహించనివిధంగా ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్లో వలంటీర్ అనారోగ్యం బారినపడటంతో ట్రయల్స్ను తాత్కాలికంగా నిలిపేశారు.