Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాజీ యుద్ధనౌకపై రాయల్ ఎయిర్ఫోర్స్ విసిరినదిగా గుర్తింపు
వార్సా: రెండో ప్రపంచం యుద్ధం నాటి ఓ బాంబును తాజాగా పోలాండ్ అధికారులు నీళ్లలో ముంచి పేల్చేశారు. 1945లో నాజీ యుద్ధనౌకపై రాయల్ ఎయిర్ఫోర్స్ ఈ బాంబును విసిరిందట. కానీ, అది పేలలేదు. అమాంతంగా కింద పడిపోయింది. స్వినోవిస్యా ప్రాంతంలోని ఓడరేవు వద్ద భూమిలో 12 మీటర్ల లోతులో పాతుకుపోయిన ఐదు టన్నుల బరువున్న బాంబును అధికారులు గతేడాది గుర్తించారు. 2.4 టన్నుల పేలుడు పదార్థాలు ఉన్న ఈ బాంబుకు 'టాల్ బాయ్' అని పేరు పెట్టారు. 'బాల్టిక్ సీ' సముద్రంలో టాల్బాయ్ బాంబును ముంచి పేలుడు సంభవించకుండా నిర్వీర్యం చేసేందుకు నేవీ అధికారులు ప్రయత్నించారు. కానీ, ఆకస్మాత్తుగా పేలుడు సంభవించిందని చెబుతున్నారు. ఈ ఆపరేషన్ చేపట్టకముందే స్థానిక ప్రజలను ఇండ్లు ఖాళీ చేయించి బాంబు నిర్వీర్యం చేసే ప్రాంతానికి 2.5 కి.మీ దూరంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే బాంబు పేల్చేటపుడు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. బాంబు పేలుడు ధాటికి నీరు పెద్దఎత్తున పైకి ఎగసి పడింది.ఈ దృశ్యాలు హల్చల్చేస్తున్నాయి.