Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎంఎఫ్ అంచనా
వాషింగ్టన్ : దేశంలో 1991 తర్వాత ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి వచ్చాక ప్రభుత్వ అప్పులు స్థిరంగా పెరుగుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజాగా పేర్కొన్నది. గత దశాబ్దకాలంలో భారతదేశ ప్రభుత్వ అప్పులు జీడీపీలో 70శాతం వరకూ చేరుకున్నాయనీ, కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం నేపథ్యంలో అప్పులు మరింతగా పెరిగి 90శాతానికి చేరుకుంటాయని ఐఎంఎఫ్ అంచనావేసింది. ''మాకున్న సమాచారం ప్రకారం, కోవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వ వ్యయం పెరిగిందని భావిస్తున్నాం. మరోవైపు పన్ను ఆదాయాలు పడిపోయాయి. ఆర్థిక కార్యకలాపాలు క్షీణించాయి. ఈ లోటును పూడ్చుకోవటం కోసం అప్పులపై ఆధారపడాల్సిందే. ఈనేపథ్యంలో జీడీపీలో అప్పులు 90శాతానికి చేరుకుంటాయని అంచనావేస్తున్నా''మని ఐఎంఎఫ్ ద్రవ్య సంబంధాల విభాగం డైరెక్టర్ విటార్ గాస్పర్ అన్నారు.