Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థాయ్ లాండ్ లో కొనసాగుతున్న ఆందోళనలు
బ్యాంకాక్ః ప్రధాని ప్రయూత్ చన్ ఓచా రాజీనామా చేయాలన్న డిమాండ్తో థాయ్ లాండ్లో ఆందోళనలు ఉధతంగా కొనసాగు తున్నాయి. గత మూడు నెలలుగా జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా నిరసనకారులు బుధవారం రాజధాని బ్యాంకాక్ లోని ప్రధాని కార్యాయలం గేటు ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో వేలాది మంది బైటాయించారు. కనీసం మూడు రోజుల పాటు తాము ఇక్కడే కూర్చోవాలని నిర్ణయించుకున్నట్లు నిరసనకారులు తెలిపారు. ప్రయూష్ రాజీనామా చేసే వరకూ తాము ఆందోళనలు విరమించేది లేదని ప్రొటెస్టు నేత అర్నాన్ నాంపా అన్నారు. రాచరికపు అధికారాలను కట్టడి చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయానికి 50 మీటర్ల పరిధిలో ఆందోళనకారులు ఉండడం చట్ట విరుద్ధమని పోలీసు శాఖ అధికార ప్రతినిధి కిస్సానా ప్రతానాచరోయిన్ పేర్కొన్నారు. అంతకు ముందు బ్యాంకాంక్లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా రాచరికపు మద్దతుదారులు నిరసన కారులను కవ్వించడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. ఆరు సంవత్సరాల క్రితం సైనిక తిరుగుబాటు నేపథ్యంలో 2014లో అధికారం చేపట్టిన ప్రయూష్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో గత కొన్ని నెలలుగా థారు లాండ్లో ప్రధానంగా విద్యార్థులు, యువకుల నేతృత్వంలో ఆందోళనలు జరుగుతున్నాయి.