Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట భారత దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘలపై నిరసన తెలియజేసేందుకు గురువారం భారత హైకమిషన్ సీనియర్ దౌత్యవేత్తను పాక్ పిలిపించింది. జాండ్రోట్ సెక్టార్లో బుధవారం విచక్షణారహితంగా, ప్రేరేపించని కాల్పుల కారణంగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. కాగా 2003 కాల్పుల విరమణ అవగాహనను గౌరవించాలని, ఇతర కాల్పుల విరమణ ఉల్లంఘన సంఘటనలపై దర్యాప్తు చేయాలని, నియంత్రణ రేఖ, సరిహద్దుల్లో శాంతిని కొనసాగించాలని భారత్ కోరింది.