Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ గురువారం రాత్రి విడివిడిగా చర్చలో పాల్గొన్నారు. ఫిలదెల్ఫియాలో ఏబీసీ న్యూస్తో బిడెన్, మియామిలో ఎన్బీసీ న్యూస్తో ట్రంప్ డిబేట్కు హాజరయ్యారు. ఇరువురూ ఓటర్ల నుంచి ప్రశ్నల పరంపరను ఎదుర్కొన్నారు. కరోనా వైరస్పైనే ప్రధానంగా ప్రశ్నలు ఎదురయ్యాయి. గత నెలలో బిడెన్తో చర్చకు ముందు కరోనా పరీక్ష చేయించుకున్నానో లేదో తెలియదని ట్రంప్ చెప్పారు. సురక్షితం, సమర్ధవంతమైనదని తేలితే తాను వ్యాక్సిన్ తీసుకుంటానని బిడెన్ చెప్పారు. 1994 క్రైమ్ బిల్లుకు మద్దతిస్తారా అని బిడెన్ను ఓటర్లు ప్రశ్నించగా, ఆ బిల్లు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు విస్తరణపై ఎన్నికలకు ముందుగా తానొక స్పష్టమైన వైఖరితో వస్తానన్నారు. దేశంలోని సంపన్నులపై పన్నులు వేయాలని అందుకోసం చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. ట్రాన్స్జెండర్ల పట్ల ఎలాంటి వివక్ష వుండదన్నారు. రుణాల ఎగవేతకు సంబంధించి ట్రంప్ను ప్రశ్నించగా విదేశీ బ్యాంక్కు తాను కొంత మొత్తం చెల్లించాల్సి ఉన్న మాట నిజమేనని ట్రంప్ అంగీకరించారు. అయితే, తన మొత్తం ఆస్తులతో పోల్చితే అది చాలా స్వల్పమని ట్రంప్ వ్యాఖ్యానించారు.