Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా నేపథ్యంలో తాజా ఆంక్షలు
పారిస్: కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్(ఈయు) దేశాల్లో శనివారం కొత్త కరోనా నిబంధనలు విధించారు. గత వారం రోజుల్లో ఈయులో ఆందోళనకరస్థాయిలో 44 శాతం కేసుల పెరుగుదల నమోదు చేసుకున్నాయని ప్రపంచ ఆరోగ్య స్ంస్థ(డబ్ల్యుహెచ్ఓ) నివేదించిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి నుంచి పారిస్తో పాటు ఫ్రాన్స్లోని ఇతర నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఇది మరో నెల రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. దీంతో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఈ కర్ఫ్యూను ఎదుర్కోనున్నారు. అదేవిధంగా ఇంగ్లండ్లో రాజధానితో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలు సమూహాం కావడాన్ని నిషేధించారు. ఇటలీలో బార్లను తెరవడంపై ఆంక్షలతో పాటు, క్రీడా ఉత్సవాలను రద్దు చేశారు. ఫ్రాన్సలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 32 వేలకు పైగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి.