Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22 మంది సైనికులు గల్లంతు
హనోయి : వియత్నాంలో ఆదివారం తెల్లవారుజామున కొండచరియుల పడి 22 మంది సైనికులు గల్లంతయ్యారు. వీరంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. శాంతి సమయంలో ఇంత భారీ సంఖ్యలో సైనికులను కోల్పోవడం వియత్నాంలో ఇదే మొదటిసారి. క్వాంగ్ త్రి రాష్ట్రంలోని నాల్గొవ మిలటరీ రెజియన్లోని ఒక యూనిట్పై కొండచరియులు పడి ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 2 గంటల నుంచి కొండ చరియులు బాంబులు మాదిరిగా పడ్డాయని, కొండ మొత్తం ధ్వంసమయిందని అధికారులు తెలిపారు. బురద కింద సైనికులంతా మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ మూడు మృతదేహాలను వెలికితీసారు. వియత్నాంలో కొన్ని రోజులు నుంచి భారీ వర్షాలు, వరదలు ఉప్పొంగుతున్నాయి. అక్టోబర్లో సాధారణంగా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. అయితే ఈ ఏడాది మరింత తీవ్రంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే తువా తైన్ రాష్ట్రంలో కొండచరియలు పడి 13 మంది మృతి చెందారు.