Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కువ మంది భారత సంతతి సభ్యులు
వాషింగ్టన్ : నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు..ఆ దేశ కాంగ్రెస్లో పెనుమార్పులు తీసుకురానున్నాయి. ఈ సారి కాంగ్రెస్కు భారత సంతితి వ్యక్తులు ఎక్కువ మంది గెలిచే అవకాశముందని సమాచారం. ఇదే అంశాన్ని పార్లమెంట్ సభ్యుడు, భారత సంతతి వ్యక్తి రాజా కృష్ణమూర్తి సైతం ప్రస్తావించారు. కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహించేందుకు పోటీ పడుతున్న భారత సంతతిని ఆయన 'సమోసా కారకస్' అని అభివర్ణించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐదుగురు చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, నలుగురు ప్రతినిధుల సభ సభ్యులుగా, మరోకరు సెనేటర్, డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారీస్ ఉన్నారు. వీరంతా ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరుపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సీనియర్ డా. అమీ బెరా, ఆర్వో ఖన్నా, కృష్ణమూర్తితో పాటు ఏకైక, తొలి భారత సంతతి చెందిన ఏకైక మహిళా ప్రమీలా జయపాల్ కూడా ఈ అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి చట్ట సభకు ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా, వచ్చే ఏడాది కొత్త సభ్యులతో ఏర్పాటు కానున్న చట్ట సభలో ప్రమీలా జయపాల్కు తోడుగా డా. హీరా త్రిపుర్నేని జత అయ్యే అవకాశాలున్నాయి. అరిజోనాలోని ఆరవ కాంగ్రెషనల్ జిల్లా నియోజవర్గ రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్ ష్వీకెర్ట్ కన్నా హీరానే ముందంజలో ఉన్నారు. టెక్సాస్లోని 22వ కాంగ్రెషనల్ జిల్లాకి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రోరు నెహ్లాస్పై డెమొక్రటిక్ అభ్యర్థి శ్రీ ప్రీట్సన్ కులకర్ణి ఐదు శాతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2018లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల్లో ఆయన తృటిలో ఓడిపోయారు. కాగా, ఇప్పుడు టెక్సాస్ నుండి తొలి భారత సంతతికి చెందిన కులకర్ణి..చట్ట సభకు ప్రాతినిధ్యం వహించాలని రాజకీయ పండితులు అకాంక్షిస్తున్నారు. అదేవిధంగా మనేలోని సెనేటర్ అభ్యర్థి కోసం గట్టి పోటీనిస్తున్న రిపబ్లికన్ నేత, సెనేటర్ సుశాన్ కొల్లిన్పై భారత సంతతికి చెందిన సారా గిడన్ గెెలుపొందే అవకాశాలున్నాయని డెమొక్రటిక్ గట్టిగా నమ్ముతోంది. అదేవిధంగా కమలా హారీస్..తొలి ఉపాధ్యక్ష ఎన్నికలకు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా డా. బోరా..ఐదవ సారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఎక్కువ కాలం చట్ట సభల కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక భారత సంతితి చెందిన నేత బోరా కావడం విశేషం.