Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : బీసీల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్లను ఆదివారం ప్రకటించారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు ఈ ప్రకటన చేశారు. బీసీ కార్పొరేషన్ల చైర్మెన్లు, డైరెక్టర్ల పేర్లను మంత్రులు ప్రకటించారు. మొత్తం 139 బిసి కులాలకుగానూ ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి. వీటిలో ఒక్కో కార్పొరేషన్కు చైర్మన్తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండగా, చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యాన్ని కల్పించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం ధర్మాన కష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ, శంకర్ నారాయణ, ఎంపి మోపిదేవి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.